Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలను భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు: ఏపీ అసెంబ్లీ ఆమోదం (video)

ఐవీఆర్
మంగళవారం, 23 జులై 2024 (15:23 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఎంతగానో భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టంతో ఏపీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు తెలియకుండానే భూములు వేరెవరో తమ భూముల్లో కలిపేసుకోవచ్చనీ, అలాగే భూమి విస్తీర్ణం తప్పులు దొర్లితే దాన్ని సరిచేసుకోవాలంటే రైతులకు చుక్కలు అగుపిస్తాయన్న... ఇత్యాది అనేక అంశాలతో ఈ చట్టం వున్నది.
 
దాంతో ఏపీ ప్రజలు ఈ చట్టంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసారు. దాంతో ఆనాడు తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తాము అధికారంలోకి రాగానే వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం నేడు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే ఆరోగ్య వర్శిటీ పేరు మార్పు బిల్లు కూడా ఆమోదం పొందింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ రెండు బిల్లులు ఆమోదం పొందినట్లు సభలో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments