Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మెడికల్ కాలేజీలకు నిధుల విడుదల

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (07:24 IST)
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మాణానికి రూ.2050 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 500 కోట్లు. కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు 500 కోట్లు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 550 కోట్లు కేటాయించింది.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో ఒక్కొక్క చోట 100 ఎంబీబీఎస్ సీట్లు, మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్ సీట్లు లభించనున్నాయి.

అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని మరియు పులివెందులలో కాలేజీలకు 104.17 కోట్ల రూపాయలతో  స్థలాల కొనుగోలుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments