Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:52 IST)
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను ఆ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనందుంగల విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలను తరలిస్తున్నందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్ర చందనం పట్టుబడుతుంది. 
 
మంగళవారం చిత్తూరు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న రూ.3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, మురుగేశన్, పెరుమాళ్ వెంకటేష్, కరియ రామన్, కలంజన్, వెంకటేష్ ఆర్. గోవిందరాజులు అనే వారిని అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న ఒక మినీ వ్యానును తనిఖీ చేయగా, అందులో రూ.4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం, నజీర్ బాషా, ముత్తురామన్‌ అనే వారిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారిగా భావిస్తున్న సెంథిల్ కుమార్ అనే బడా స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments