Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్ర చందనం స్వాధీనం... 12 మంది అరెస్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (14:52 IST)
చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను ఆ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనందుంగల విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ దుంగలను తరలిస్తున్నందుకు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
చిత్తూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ఎర్ర చందనం పట్టుబడుతుంది. 
 
మంగళవారం చిత్తూరు నుంచి తమిళనాడుకు తరలిపోతున్న రూ.3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, మురుగేశన్, పెరుమాళ్ వెంకటేష్, కరియ రామన్, కలంజన్, వెంకటేష్ ఆర్. గోవిందరాజులు అనే వారిని అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న ఒక మినీ వ్యానును తనిఖీ చేయగా, అందులో రూ.4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో దేవన్ అలియాస్ నాగరాజ్, వైద్యలింగం, నజీర్ బాషా, ముత్తురామన్‌ అనే వారిని అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్‌కు సూత్రధారిగా భావిస్తున్న సెంథిల్ కుమార్ అనే బడా స్మగ్లర్ పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments