Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోనే రెచ్చిపోయిన స్మగ్లర్లు, శ్రీవారి ఆలయం వెనుకే..?

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (21:10 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఎర్రచందనం కూలీల తిరగడం కలకలం రేపుతోంది. అడవిలో దారి తప్పి శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న మ్యూజియం దగ్గరకు నలుగురు ఎర్రచందనం కూలీలు చేరుకున్నారు.
 
ఫేస్ రికగ్నైజ్డ్ కెమెరాలు ఈ ఎర్రచందనం కూలీలను పట్టించాయి. సీసీ కెమెరాల్లో గమనించి అప్రమత్తం చేయడంతో దగ్గరలోని భద్రతా సిబ్బందిని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తం చేశారు. 
 
నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకుని వారిని ప్రశ్నించారు. నలుగురిని ప్రశ్నించగా వారు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురి కోసం అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరి దగ్గర నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనం దుంగలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
 
భద్రతా చర్యల్లో భాగంగా అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం కూలీలను ప్రశ్నించగా రామక్రిష్ణ తీర్థం దగ్గర ఎర్రచందనం నరికినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దారి తప్పి పొరపాటున మ్యూజియం వైపు వచ్చినట్లు వివరించారు.
 
అయితే తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సరిగ్గా వెనుక వైపునే ఎర్రచందనం స్మగర్లు కనిపించడం.. వారిని పట్టుకోవడం కలకలం రేపుతోంది. వీరి వెనుక ఉన్న స్మగ్మర్ల కోసం టాస్క్ ఫోర్స్ గాలిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments