Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ హస్తిన టూర్ రద్దు వెనుక కారణమిదే?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (13:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం హస్తిన పర్యటనకు వెళ్లాల్సివుంది. ఈ పర్యటన షెడ్యూల్‌ను కూడా సీఎం క్యాంపు కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన ముఖ్యాంశమే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి, రాష్ట్ర పరిస్థితులను వివరించడమే కాకుండా, ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, పంచాయతీ భవనాలకు వైకాపా పర్టీ జెండా రంగులు తదితర అంశాలపై చర్చిస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ, పర్యటన ప్రారంభానికి కేవలం 2 గంటల ముందు సీఎం జగన్ టూర్ రద్దు అయింది. 
 
అయితే, ఈ పర్యటన రద్దుకు గల కారణాలు ఢిల్లీ వర్గాలు అందించిన సమాచారం మేరకు... ఏపీకి చెందిన బీజేపీ నేతలు కొందరు పార్టీ అధిష్టానానికి ఓ లేఖ పంపించారు. ఇందులో రాష్ట్రంలో జరుగతున్న పరిస్థితులను కూలంకుశంగా వివరించారు. ముఖ్యంగా, పంచాయతీ భవనాలకు పార్టీ జెండా గుర్తులు వేయడం, ఎస్ఈసీ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేయడం, తితిదే భూముల వ్యవహారం, తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. 
 
ఈ లేఖను బీజేపీ హైకమాండ్ నిశితంగా పరిశీలించింది. అదేసమయంలో సీఎం జగన్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్‌ను హోం మంత్రి అమిత షా రద్దు చేశారు. నిసర్గ తుఫాను ముందస్తు చర్యల్లో బిజీగా ఉన్నందుకు ఈ అపాయింట్మెంట్ రద్దు చేసినట్టు హోం మంత్రి కార్యాలయం పేర్కొంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తన హస్తిన పర్యటను వాయిదావేసుకున్నారని బీజేపీ ఢిల్లీ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments