Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలో భారత్‌ను నిలబెడుతున్న ఐదు రాష్ట్రాలు!

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (13:40 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దేశం మొత్తం లాక్డౌన్‌లోకి వెళ్లడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ఇపుడు గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. అయితే, లాక్డౌన్ సమయంలో మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి కోలుకునేలా చేయడంలో ఐదు రాష్ట్రాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో ఈ ఐదు రాష్ట్రాలదే అధిక వాటా. 
 
తాజాగా ఎలరా సెక్యురిటీస్ అనే అధ్యయన సంస్థ జరిపిన ఓ సర్వేలో దేశ జీడీపీలో కేరళ, పంజాబ్, తమిళనాడు, హర్యానా, కర్నాటక రాష్ట్రాల వాటా 27 శాతంగా ఉంది. విద్యుత్ వినియోగం, రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లకు చేరుకోవడం వంటి అంశాల్లో ఈ రాష్ట్రాలు ముందున్నాయని పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఎలరా సెక్యురిటీస్ ఆర్థికవేత్త గరిమా కపూర్ మాట్లాడుతూ, దేశంలో పారిశ్రామికంగా ముందుండే మహారాష్ట్ర, గుజరాత్ మాత్రం ఇంకా వేగం పుంజుకోలేదని, దీనికి కారణం అమలవుతున్న కఠని ఆంక్షలే దీనికి కారణమని చెప్పారు. దేశ వ్యాపంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ ఈ వృద్ధి విస్తారంగా కాకుండా అక్కడక్కడా మాత్రమే నమోదవుతోందని గుర్తుచేశారు. 
 
పరిస్థితి సాధారణ స్థితికి రావడం ద్వారానే దేశ ఆర్థికి స్థితికి కావాల్సి ఉత్తేజం లభిస్తుందన్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలో వస్తువుల డిమాండ్ పెరిగిపోయిందని, ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ఏసీలు, బైకులు, వాషింగ్ మెషీన్లు, వ్యాక్యూమ్ క్లీనర్ల డిమాండ్ పెరుగుతుందని స్పష్టం చేశారు. భవిషత్తలులో డిమాండ్ కొనసాగుతుంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments