Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (14:14 IST)
అత్యాచారం, హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు ఆయేషా మృతదేహం ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఆధారాలు సేకరించి నివేదిక తయారుచేస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశానవాటికలో పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం శవపరీక్ష పూర్తి చేశారు. సీబీఐ ఎస్పీ విమల్‌ ఆదిత్య నేతృత్వంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు.

రీపోస్టుమార్టంలో పుర్రె, అస్థికలపై చిట్లిన గాయాలను, ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. ఆయేషామీరా ఎముకల నుంచి అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించింది.

ఆయేషా మీరా 2007 డిసెంబర్‌ 27న అత్యాచారం, హత్యకు గురైన విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో భాగంగా ఫోరెన్సిక్‌ నిపుణులు రీపోస్టుమార్టం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments