Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచదార కోటా త‌గ్గించేశారు... కందిప‌ప్పు రేటు పెంచేశారు!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (16:55 IST)
నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని నిత్యావసర సరుకులు రేషన్ డిపోల ద్వారా అందించాల‌ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్. బాబూరావు డిమాండు చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని రేషన్ డిపోలు, రేషన్ పంపిణీ వాహనాలను పరిశీలించి ప్రజలతో బాబురావు, సిపిఎం నేతలు మాట్లాడారు. 

 
వెయ్యి మంది కార్డులు ఉన్న డిపోలో 200 మందికి మాత్రమే పంచదార, అది కూడా అరకిలో
అందిస్తున్నార‌ని, ప్రతి కార్డు దారుడికి అరకిలో అందించాల్సి ఉన్నా, గత కొద్ది నెలల నుండి పంచదార కోటాలో కోత పెట్టార‌ని ఆరోపించారు. కొన్ని డిపోలలో నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కందిపప్పు కిలో అందిస్తున్న గతంలో 40 రూ. ధరను 67 రూపాయలకు పెంచార‌ని, ఇక సామాన్యుల‌కు ఏం ఉప‌యోగ‌మ‌ని ప్ర‌శ్నించారు.
 

పంచదార ప్రతి రేషన్ దారుకు కిలో అందించేవార‌ని, ఇపుడు దానిని అర కిలోకి తగ్గించార‌ని, అదీ అర కిలో 17 రూపాయలకు పెంచార‌ని తెలిపారు. పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిపివేశార‌ని, ఇతర నిత్యావసర సరుకులు డిపోల ద్వారా అందించడం లేద‌ని ఆరోపించారు. అధిక ధరలతో ప్రజల సతమతమవుతున్నాప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించడం శోచనీయం అని బాబూరావు విమ‌ర్శించారు. ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ స్పందించి అన్ని నిత్యావసర వస్తువుల ద్వారా అందించాల‌ని, తగ్గించిన పంచదార కోటాను పునరుద్ధరించాల‌ని, పామాయిల్ కూడా సరఫరా గతంలో వలే చేయాల‌న్నారు.
 
 
డిపోల ద్వారా నాణ్యమైన బియ్యం అందించాల‌ని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అధిక ధరలను నియంత్రిస్తుందని, ప్రభుత్వాలు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల‌న్నారు. ఒక వైపున కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచింద‌ని, మరోవైపు విద్యుత్ చార్జీలు వివిధ రూపాల్లో భారం పడుతోంద‌ని అన్నారు. కూరగాయల మొదలు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయ‌ని, ఈ తరుణంలో పేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 
 
 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ప్రజలను ఆదుకోవాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను
పటిష్ఠం చేయాల‌న్నారు. గతంలో వలే వంట గ్యాస్ మూడు వందల రూపాయలకు తగ్గించాల‌ని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు బి రమణారావు, కే దుర్గారావు తదితరులు
పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments