Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆయన కువైట్‌లో ఉన్నాడు కదా.. ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. ఏం కోరికలు లేవా...?

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (11:12 IST)
నెల్లూరు జిల్లా రాపూరు పంచాయతీ కార్యదర్శి చెంచయ్య ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ ఆరోపిస్తుంది. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం కోసం చెంచయ్యను సంప్రదించగా, ఆయన తన కోర్కె తీర్చాలంటూ గత రెండేళ్లుగా ఫోన్లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాపూరు పోలీసులు చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ఇదే అంశంపై బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి డెత్ సర్టిఫికెట్ కోసం రాపూరు పంచాయితీ కార్యదర్శి చెంచయ్యను సంప్రదిస్తే.. ఆయన తన కోర్కెను తీర్చాలంటూ వేధిస్తున్నారని తెలిపారు. మీ ఆయన కువైట్లో ఉన్నాడు కదా ఒంటరిగా ఎలా ఉన్నావు అంటూ ఫోన్లు చేసి మనశ్సాంతి లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ వేధింపులు గత రెండేళ్లుగా భరిస్తున్నానని, ఇక భరించలేకే జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీంతో రాపూరు పోలీసులు స్పందించి చెంచయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన చెంచయ్యను సస్పెండ్ చేయాలని, భవిష్యత్‌లో తనలాగా మరో మహిళకు జరగకూడాదని ఆమె కోరారు. తాను గిరిజన మహిళ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయలేకపోయానని, ఇపుడు వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments