Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో దెయ్యం వుందన్నాడు.. యువతిపై కన్నేశాడు.. బెదిరించి లోబరుచుకుని?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (11:43 IST)
ఆధునికత పెరిగినా.. మూఢనమ్మకాలు మాత్రం మూలన పడట్లేదు. తాజాగా హైదరాబాదులో దారుణం జరిగింది. మంత్రాల పేరిట ఓ యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది.


మంత్రాల పేరిట మోసగాళ్లు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందటే? ఇంట్లో దెయ్యం ఉందని... దాన్ని తన మంత్రాలతో తరిమేస్తానని నమ్మించిన ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
బోరబండకు చెందిన దంపతుల అనుమానాన్ని ఆసరాగా చేసుకుని యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తమ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటం, పలు సమస్యలు వస్తుండటంతో కొన్ని వారాల క్రితం మల్లేపల్లికి చెందిన భూతవైద్యుడు ఆజంను కలిశారు ఆ దంపతులు. వారు చెప్పింది విన్న ఆజం ఇంట్లో దెయ్యం ఉందని, దాని వల్లే చెడు జరుగుతోందని వారిని నమ్మించాడు. 
 
దానిని ఇంట్లోంచి వెళ్లగొడితే అంతా మంచే జరుగుతుందన్నాడు. ఈ క్రమంలోనే దంపతుల కుమార్తెపై కన్నేసిన ఆజం... తనను పెళ్లి చేసుకోకుంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఆమెను బెదిరించాడు. అలా లోబరుచుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న భూత వైద్యుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments