Webdunia - Bharat's app for daily news and videos

Install App

100-200 వరకు గుంజీలు.. 50 మంది విద్యార్థినిలు అస్వస్థత (video)

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:10 IST)
క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట విద్యార్థినుల‌ చేత గుంజీలు తీయించారు. ఏపీలోని అల్లూరి జిల్లా రంప‌చోడ‌వ‌రంలోని ఏపీఆర్ బాలిక‌ల జూనియ‌ర్ క‌ళాశాల‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వరుసగా మూడు రోజులు బాలికలను వంద నుంచి 200 వరకు గుంజీలు తీయించడంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 
 
కొంద‌రు న‌డ‌వ‌లేని స్థితికి చేరుకున్నారు. త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అంద‌డంతో వారు కాలేజీకి చేరుకుని పిల్ల‌ల‌ను ఏరియా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ప్ర‌స్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా, బాలిక‌ల‌ను చేతు‌ల‌పై మోసుకెళ్తున్న వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 
క్ర‌మ‌శిక్ష‌ణ పేరుతో ప్రిన్సిప‌ల్ ప్ర‌సూన, పీడీ కృష్ణ‌కుమారి విద్యార్థినుల‌తో గుంజీలు తీయించారు. ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థినులు.. తాము చెప్పిన మాట విన‌డం లేద‌ని ఈ పని చేయించారు. 
 
క్ర‌మ‌శిక్ష‌ణ పేరిట విద్యార్థినుల‌ చేత గుంజీలు తీయించ‌డం దారుణ‌మైన చ‌ర్య అని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐటీడీఏ పీఓ క‌ట్టా సింహాచ‌లాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments