Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ చెర నుంచి తిరుమలకు విముక్తి - రమణ దీక్షితుల సంచలన ట్వీట్

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (10:40 IST)
టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు కూడా ప్రభుత్వ ఉద్యోగ విరమణ చట్టం వర్తింప జేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో తిరిగి ఆయన్ను ఆగమ శాస్త్ర సలహా మండలి సభ్యుడిగా విధుల్లోకి తీసుకున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఆయన శ్రీవారి ఆలయంలో తిరిగి బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. శ్రీవారి ఆలయానికి కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విముక్తి కలగాలని ట్వీట్ చేశారు. టీటీడీ పాలనా నిర్వహణపై కూడా సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రమణ దీక్షితులు స్పందించారు. 
 
ఉత్తారఖండ్‌లో చార్‌దామ్‌ సహా 54 దేవాలయాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ పూర్తి కావడంతో ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 
 
దీనికి రమణ దీక్షితులు కూడా ఇందుకు సమాధానం ఇచ్చారు. ''ఆల్ ది బెస్ట్ స్వామిజీ.. మీ విజయానికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీ విజయం సనాతన ధర్మం విజయంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్‌లాగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు కూడా విముక్తి లభించాలి'' అంటూ ఆయన పేర్కొన్నారు.
 
టీటీడీ పాలనా నిర్వహణపై కూడా సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరారు. ఆలయ ఆస్తులు, నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. దాన్ని ఉటంకిస్తూ.. రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదయినా మనసులో వున్నదివున్నట్లు మాట్లాడేయడం దీక్షితులకు అలవాటని అంటుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments