Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తింటున్నంతసేపు ఇస్తరాకు.. తిన్నాక ఎంగిలి ఆకు...

తింటున్నంతసేపు ఇస్తరాకు.. తిన్నాక ఎంగిలి ఆకు...
, శుక్రవారం, 15 మే 2020 (16:15 IST)
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసే ట్వీట్ వెనుక నిగూఢార్థం దాగివుంటుంది. అందుకే ఆయన చేసే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియానే కాదు... టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. తింటున్నంత సేవు ఇస్తరాకు.. తిన్న తర్వాత ఎంగిలి ఆకు అంటారంటూ ఓ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేయడానికి అసలు కారణ లేకపోలేదు. 
 
బండ్ల గణేష్ నిర్మాతగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం విడుదలై ఇటీవల ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్ పేరును మరచిపోయారు. ఆ తర్వాత చేసిన తప్పును తెలుసుకుని మరో ట్వీట్ చేశారు. అందులో నిర్మాత బండ్ల గణేష్‌ను ఆకాశానికెత్తేశారు. దీంతో ఈ వివాదం ముగిసిపోయిందని ప్రతిఒక్కరూ భావించారు. 
 
కానీ, బండ్ల గణేష్ బాగా హర్ట్ అయినట్టున్నారు. అందుకే ఈ అంశాన్ని మనసులో పెట్టుకునే ఆయన తాజా ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకరేపుతున్న బండ్ల గణేష్ ట్వీట్‌ను పరిశీలిస్తే, 'తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక... లేని మాటలు అంటకడతారు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ ప్రైమ్‌లో ఏడు భారతీయ సినిమాలు.. నెట్టింటో విడుదల.. ఇక పండగే