Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి?.. జగన్ సర్కార్ లో తెలంగాణ వాసులకు పెద్దపీట

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (19:08 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తెలంగాణ వాసికి పెద్ద పీట వేయబోతున్నదా? అవుననే అంటున్నాయి పరిశీలక వర్గాలు. తెలంగాణ వాదులకు జగన్ సర్కార్ అందలం కల్పిస్తున్నదని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఇప్పటికే ఆక్షేపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ మరో తెలంగాణ వాసిని కీలక పదవిలో నియమించనున్నట్లు తెలిసింది. ఇటీవలి కాలం వరకు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా వ్యవహరిచిన కె. రామచంద్ర మూర్తిని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించనున్నట్లు తెలిసింది.

జగన్ సర్కార్ లో సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ (నల్లగొండ), కమ్యూనికేషన్స్ సలహాదారుగా కృష్ణమోహన్ (ఖమ్మం), జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ (వరంగల్) నియమితులైన విషయం విదితమే. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించింది.

తాజాగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రామచంద్రమూర్తి (ఖమ్మం)కి జగన్ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా తెలంగాణ వాసులకు ఏపీ ప్రభుత్వంలో సీఎం జగన్ కల్పిస్తున్న అవకాశాలు జర్నలిస్టు సర్కిళ్ళలో హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments