Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. అరెస్టు తప్పదా?

ఠాగూర్
మంగళవారం, 19 నవంబరు 2024 (11:47 IST)
అసభ్య దూషణలు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లను కించపరిచిన కేసులో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరయ్యేందుకు తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ కోరారు. ఈ మేరకు ఒంగోలు గ్రామీణ సీఐ శ్రీకాంత్‌ బాబుకు వర్మ వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేశారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు రాలేను అంటూ మెసేజ్ చేశారు. దీంతో వర్మ నిజంగానే షూటింగులో ఉన్నారో లేదోనని ఆరా తీస్తున్నారు. 
 
సోషల్‌మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రాంగోపాల్‌వర్మపై మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెల్సిందే. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలని పోలీసుల నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్‌ దాఖలు చేయగా, అక్కడు చుక్కెదురైంది. దీంతో ఆయన చిక్కుల్లోపడ్డారు. ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments