Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వ‌దీప్ ఎఫ్-క్ల‌బ్ ప‌బ్ ఖాతాకు ర‌కుల్ న‌గ‌దు బ‌దిలీ ఎందుకు చేసింది?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (09:47 IST)
హైదరాబాద్లో నటుడు నవదీప్ న‌డుపుతున్న ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ ఖాతాకు ప్రముఖ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది. అస‌లీ మొత్తం ఎందుకు బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింద‌నేది ఇపుడు పెద్ద ప్ర‌శ్న‌. ఆ ప‌బ్ లో మాద‌క ద్ర‌వ్యాల వినియోగం, అమ్మ‌కాలు జ‌రిగేవ‌ని పోలీసులు గుర్తించారు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే రేకెత్తింది. న‌వ‌దీప్ ప‌బ్ పై పోలీసులు దాడి చేశారు కూడా. ఇపుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ ను ఇ.డి. ఇదే విష‌య‌మై ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. 
 
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌తో వాట్సాప్‌ చాటింగ్‌లో ఆమె ఆర్థిక లావాదేవీలపైనా చర్చించినట్లు ఇ.డి. ఆధారాలను సంపాదించింది. ఈడీ విచారణలో అధికారులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రధానంగా నగదు బదిలీ, క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, కెల్విన్‌తో ఆర్థిక లావాదేవీపై వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు. ఏడు గంటలు పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. రియా చక్రవర్తితో హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న స్నేహ బంధంపైనా ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. 
 
ర‌కుల్ ఇచ్చిన స‌మాధానాల‌పై త‌ర్వాత ఈ నెల 13న న‌వ‌దీప్, క్లబ్ మేనేజర్ విచారణతో ఈడీ అధికారులు ఒక నిర్ణ‌యానికి రానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments