Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా స‌భ ప్రారంభ‌మే కాలేదు... వైకాపాకు ద‌డ ద‌డ‌!

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (13:12 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గన్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ సిఎం ర‌మేష్ ప‌దునైన కామెంట్లు చేశారు. విజ‌య‌వాడ‌లో బీజేపీ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ వేదిక‌ నుంచి ఆయ‌న వైకాపాకు స‌వాళ్ళు విసిరారు. 
 
 
ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వానికి తాము కొంత సమయం ఇచ్చామని భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వైకాపా చేసిందేమీ లేదని ఆరోపించారు. విజయవాడలో సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తామని చెప్పారు. సభ ప్రారంభమే కాలేదని.. అప్పుడే వైకాపాకు దడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. 

 
రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప, ప్ర‌భుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని కొందరు అధికారులే చెబుతున్నారన్నారు. రాష్ట్ర భాజపాపై తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు సీఎం రమేశ్‌ వద్ద ప్రస్తావించగా, తెదేపా ప్రతిపక్ష పాత్ర స‌రిగా పోషించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రజాగ్రహ సభ ఆరంభం మాత్రమేనని చెప్పారు. రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఈ విషయాన్ని ఘంటాపథంగా చెబుతున్నానని సీఎం రమేశ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments