Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాడిస్ట్ ఆలోచనలు... రోడ్డు కమ్ రైల్వే వంతెన వారం రోజుల పాటు మూసివేత

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:33 IST)
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. అనేక రకాలైన కవ్వింపులకు వైకాపా నేతలు పాల్పడుతున్నారు. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనను మరమ్మతుల పేరుతో వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల కోసమే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందిస్తూ, ఈ నెల 17న రాజమండ్రి బ్రిడ్జి మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరగాల్సి ఉంది. 
 
'కొంచెం అయినా సిగ్గుండాలి' అంటూ మండిపడ్డారు. ఇన్నాళ్లు గుర్తుకురాని రైల్వే బ్రిడ్జి మరమ్మతులు అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే గుర్తొచ్చాయా? అంటూ నిలదీశారు. రైతుల పాదయాత్ర ఇటుగా వస్తుంటే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని మరమ్మతుల పేరుతో మూసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఇలాగే వ్యవహరించి ఉంటే ఏంచేసేవాళ్లు? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. శాడిస్టు ఆలోచనలు తప్పిస్తే మరొకటి కాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టయిలిస్ పొలిటికల్ యాక్షన్ చిత్రంగా : L2: ఎంపురాన్ రివ్యూ

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments