Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు అల్పపీడనం - నేడు కూడా ఏపీలో భారీ వర్షాలు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (12:23 IST)
తమిళనాడు, ఆంధ్ర్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలను వణికించిన మాండస్ తుఫాను తీరం దాటిన తర్వాత బలపడి, ఉపరితల ఆవర్తన ద్రోణిగా మారింది. దీని ప్రభావం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
 
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్నాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించివుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఈ నెల 16వ తేదీ తర్వాత తుఫానుగా మారుతుందని తెలిపింది. 
 
కాగా, ఏపీలో ఆదివారం కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి, విశాఖ, బాపట్లతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల వేలాది ఎకరాల్లోని పంటకు అపార నష్టం వాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments