Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొద్దిసేపు వర్షం మరికొద్దిసేపు పొగమంచు: వింత వాతావరణంతో భక్తులు గజగజ

ఐవీఆర్
సోమవారం, 8 జనవరి 2024 (18:39 IST)
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వింత వాతావరణం చోటుచేసుకున్నది. సోమవారం నాడు కొద్దిసేపు భారీ వర్షం మరికొద్దిసేపు పొగమంచు కమ్ముకుంటూ భక్తులను గజగజ వణికిస్తున్నాయి. ఒకవైపు ఎదుటి వ్యక్తి కూడా కనిపించనంత పొగమంచు కురుస్తోంది. విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. వీటికి తోడు వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీనితో తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
తిరుమలేశునికి నటి సురేఖావాణి తలనీలాలు
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి(surekhavani) తిరుమలేశునికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు నడకదారిని వెళ్లి తిరుమలకు చేరుకున్న సురేఖావాణి తొలుత తలనీలాలు అర్పించి అనంతరం తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకి వచ్చాక ఆమెను గుర్తుపట్టిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అడిగినవారికి కాదనకుండా ఫోటోలకి ఫోజులిచ్చారు సురేఖావాణి.
 
సురేఖవాణి అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులను పలుకరిస్తుంటారు. ఏమైనా విషయాలు వుంటే పంచుకుంటూ వుంటారు. అప్పుడప్పుడు రీల్స్, డ్యాన్సులు చేస్తూ తన ఫ్యాన్సుకి హుషారెక్కిస్తుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments