Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:50 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శంషాబాద్ - విజయవాడ - విశాఖపట్టణం, కర్నూలు -విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర రైల్వేశాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ రెండు మార్గాల్లో ప్రాథమిక ఇంజనీరింగ్ మరియు ట్రాక్ (పెట్) సర్వేకు ఆదేశించింది. సర్వే అనంతరం రైల్వే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
శంషాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ ఈ మార్గంలో పెట్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, ఇపుడు ప్రతిపాదించిన రెండు సూపర్ ఫాస్ట్ రైలు మార్గాలు మాత్రం అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది. 
 
ఈ క్రమంలోనేనే రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందే భారత్ రైళ్లను నడిపే విషయాన్ని కూడా భారతీయ రైల్వే సిద్ధమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం