Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ శుభవార్త... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (10:50 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శంషాబాద్ - విజయవాడ - విశాఖపట్టణం, కర్నూలు -విజయవాడ మధ్య సూపర్ ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా కేంద్ర రైల్వేశాఖ కసరత్తులు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ రెండు మార్గాల్లో ప్రాథమిక ఇంజనీరింగ్ మరియు ట్రాక్ (పెట్) సర్వేకు ఆదేశించింది. సర్వే అనంతరం రైల్వే ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకుంటారు. 
 
శంషాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య రైలు అందుబాటులోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ ఈ మార్గంలో పెట్ సర్వేకు అనుమతులు మంజూరు చేసింది. 
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు గంటకు 110 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తున్నాయి. అయితే, ఇపుడు ప్రతిపాదించిన రెండు సూపర్ ఫాస్ట్ రైలు మార్గాలు మాత్రం అందుబాటులోకి వస్తే ఈ మార్గాల్లో ఏకంగా 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ భావిస్తుంది. 
 
ఈ క్రమంలోనేనే రూట్‌ను నిర్ణయించేందుకు పెట్ సర్వే కోసం ఓ కాంట్రాక్టర్‌ను కూడా ఎంపిక చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వందే భారత్ రైళ్లను నడిపే విషయాన్ని కూడా భారతీయ రైల్వే సిద్ధమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం