Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచి అందుబాటులోకి..

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (10:55 IST)
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను నడిపేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక రైల్లు కూడా నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
శ్రీకాకుళం రోడ్ - వరంగల్ మీదుగా నడిచే ప్రత్యేక రైలు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు వరంగల్‌కు చేరుకుంటుంది. అలాగే, వరంగల్ బరంపురం ప్రత్యేక రైలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వరంగల్‌‍లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. 
 
బరంపురం - విజయవాడ రైలు ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ - బరంపురం మధ్య ఈ నెల 15 నుంచి 20 తేదీల మధ్య ప్రతి రోజూ విజయవాడలో రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు బరంపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు బరంపురంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు చేరుకుంటుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం