కేరళ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం.. కోళ్లు - బాతుల చంపేయాలంటూ ఆదేశం

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (10:47 IST)
కేరళ రాష్ట్రంలో మరోమారు బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. దీంతో తక్షణం బాతులు, కోళ్లను చంపేయాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. దీంతో 8 వేల పెంపుడు పక్షులైన బాతులను చంపేయాలని స్థాని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. అలాగే, కోళ్లు, మాంసం అమ్మకాలు, ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. 
 
బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులతో పాటు క్లోరినేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా, కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో పంజా విసిరింది. ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
మరోవైపు, పోలీసులు, రెవెన్యూ, జంతు సంరక్షణ శాఖ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో రక్షణ చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్ళు, బాతులు, ఇతర మాంసం అమ్మకాల ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించారు. చనిపోయిన పక్షుల నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ ల్యాబ్‌కు పంపించారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల మాంసాన్ని ఆరగించడం వల్ల అది మనుషులకు సోకే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments