ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనం రాద్దాంతం చేయడమెందుకు : ఆర్ఆర్ఆర్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (07:57 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరచాలనంపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకొచ్చిన నష్టమేమిటని ఆయన అన్నారు. పైగా, దీనిపై రాద్దాంతం చేయడం ఏమాత్రం భావ్యం కాదని హితవు పలికారు.
 
మోడీ - బాబు కరచాలనంపై రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోడీ, బాబు మధ్య కరచాలన భేటీ కేవలం 5 నిమిషాలు మాత్రమే జరిగింది. దీనిపై తమ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 
 
ప్రధానితో తమ సీఎం గంటసేపు కలిసి భోజనం చేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మధ్యాహ్న భోజనం 10-15 నిమిషాల్లో ముగిస్తారన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సీఎం జగన్‌ ఆయనతో కలిసున్నా దూరంగా కూర్చున్నారని తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 30-35 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవన్నారు. తెలంగాణలో తెదేపాతో భాజపా జతకట్టే అవకాశాలున్నట్లు కనిపిస్తోందని అన్నారు. గోరంట్ల మాధవ్‌ వీడియో మార్ఫింగ్‌ చేశారనే విషయం ఎలా తెలుస్తుందన్నారు. సకలశాఖా మంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments