Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనం రాద్దాంతం చేయడమెందుకు : ఆర్ఆర్ఆర్

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (07:57 IST)
ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరచాలనంపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకొచ్చిన నష్టమేమిటని ఆయన అన్నారు. పైగా, దీనిపై రాద్దాంతం చేయడం ఏమాత్రం భావ్యం కాదని హితవు పలికారు.
 
మోడీ - బాబు కరచాలనంపై రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోడీ, బాబు మధ్య కరచాలన భేటీ కేవలం 5 నిమిషాలు మాత్రమే జరిగింది. దీనిపై తమ పార్టీ నేతలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. 
 
ప్రధానితో తమ సీఎం గంటసేపు కలిసి భోజనం చేశారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మధ్యాహ్న భోజనం 10-15 నిమిషాల్లో ముగిస్తారన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో సీఎం జగన్‌ ఆయనతో కలిసున్నా దూరంగా కూర్చున్నారని తెలిపారు. 
 
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 30-35 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవన్నారు. తెలంగాణలో తెదేపాతో భాజపా జతకట్టే అవకాశాలున్నట్లు కనిపిస్తోందని అన్నారు. గోరంట్ల మాధవ్‌ వీడియో మార్ఫింగ్‌ చేశారనే విషయం ఎలా తెలుస్తుందన్నారు. సకలశాఖా మంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments