వీలు చూసుకుని ఢిల్లీకి రమ్మన్నారు : మోడీ కరచాలనంపై బాబు వివరణ

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (07:36 IST)
ఇటీవల ఢిల్లీకి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య కరచాలన భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఏం జరిగిందో పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ భేటీ ద్వారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. 
 
దీని గురించి పార్టీ నేతలకు చంద్రబాబు అన్ని వివరాలను వివరించారు. "రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నేను ఒక పక్కన ఉండి వేరే వారితో మాట్లాడుతున్నాను. ప్రధాని ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే నా వద్దకు వచ్చారు. మనం కలిసి చాలా రోజులైంది... ఢిల్లీ రావడం లేదా అని అడిగారు. ఢిల్లీలో నాకు పనేమీ లేదని, రావడం లేదని చెప్పాను. 
 
మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి.. మనం ఒకసారి కలవాలని ఆయన అన్నారు. నేను కూడా మిమ్మల్ని కలుద్దామనుకుంటున్నానని చెప్పాను. ఒకసారి వీలు చూసుకుని ఢిల్లీ రండి. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే నాకు అనువుగా ఉన్న సమయం చెబుతాను.. వద్దురు గాని అని ఆయన అన్నారు. నేను కూడా సరేనన్నాను" ఇదీ ఢిల్లీలో జరిగిందని పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments