Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త గవర్నర్ నజీర‌ను కలిసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‍‌ను ఏపీకి చెందిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఢిల్లీలోని జస్టిస్ నజీర్ నివాసానికి ఈ ఉదయం వెళ్లిన రఘురామరాజు పుష్పగుచ్ఛాన్ని అందించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న శాలువాను కప్పి గౌరవించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మర్యాదపూర్వకంగానే గవర్నరును కలిశానని చెప్పారు. రాష్ట్ర గవర్నరుగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక కేసులను విచారించారు. 
 
ఇలాంటి కేసుల్లో ప్రధానంగా అయోధ్య భూవివాదం, ట్రిపుల్ తలాఖ్ వంటి కేసుల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. ఇప్పటివరకు ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments