Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ కొత్త గవర్నర్ నజీర‌ను కలిసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‍‌ను ఏపీకి చెందిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఢిల్లీలోని జస్టిస్ నజీర్ నివాసానికి ఈ ఉదయం వెళ్లిన రఘురామరాజు పుష్పగుచ్ఛాన్ని అందించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న శాలువాను కప్పి గౌరవించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మర్యాదపూర్వకంగానే గవర్నరును కలిశానని చెప్పారు. రాష్ట్ర గవర్నరుగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక కేసులను విచారించారు. 
 
ఇలాంటి కేసుల్లో ప్రధానంగా అయోధ్య భూవివాదం, ట్రిపుల్ తలాఖ్ వంటి కేసుల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. ఇప్పటివరకు ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments