Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పల్స్ పోలియో - తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ఏర్పాట్లు

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (09:29 IST)
దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుక్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తెలంగాణాలో 23,331 కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు, ప్రధాన కూడళ్ళలో పల్స్ పోలియో శిబిరాలను ఏర్పాటుచేశారు. 
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు.. సామాజిక కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ముఖ్య కూడళ్ళలో పల్స్ పోలియో చుక్కలను చిన్నారులకు వేయనున్నారు. 
 
ఆదివారం పంపిణీ చేయడంతో పాటు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే చర్యల్లో భాగంగా, ఐదేళ్ళలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments