Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్‌వీ సి-49: ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన గవర్నర్

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (17:49 IST)
శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి ప్రయాణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సి-49 వాహకనౌక ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టటం ముదావహమన్న గవర్నర్, ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను అభినందించారు.
 
భారత్‌కు చెందిన ఉపగ్రహం ఈవోఎస్‌-01 వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుండగా, ప్రయోగం సఫలీకృతం చేసిన ప్రతి ఒక్క ఇస్రో శాస్త్రవేత్త అభినందనీయుడేనన్నారు.
 
శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సి-49ను విజయవంతంగా ప్రయోగించడం దేశ అంతరిక్ష కార్యక్రమం పట్ల వారి అంకితభావానికి నిదర్శనమని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments