Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవీ రెడ్డి రాజీనామా.. ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్య

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్‌ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఏపీ ఫైబర్ నెట్‌లో భారీగా అవినీతి చోటుచేసుకున్న ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న దినేశ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేసింది. అదేసమయంలో కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 
 
గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్‌లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టిసారించింది. అదే సమయంలో ఫైబర్ నెట్‌లో చైర్మన్, ఎండీ మధ్య విభేదాల వ్యవహారం కూడా ప్రభుత్వానికి అసహనానికి గురిచేసింది. 
 
దీనికి సంబంధించిన నివేదిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరిన కొద్ది సమయంలో ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం, ఎండీ పదవి నుంచి దినేశ్ కుమార్‌ను తప్పించడం అగమేఘాలపై జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Madhavi Latha: మాధవి లతపై తాడిపత్రిలో కేసు.. కమలమ్మ ఎవరు?

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

తర్వాతి కథనం
Show comments