Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు 'దేశం' ఎమ్మెల్యే షాక్.. పవన్ చెంతకు రావెల కిషోర్ బాబు

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (08:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, ప్రత్తిపాటి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు తేరుకోలేని షాక్ ఇవ్వనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ జనసేన వైపు అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. 
 
నిజానకి ప్రత్తిపాటి ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు కొంతకాలం సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించారు. ఆయనతో పాటు మరికొందర్ని తొలగించారు. అప్పటి నుంచి రావెల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 
దీనికితోడు పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని మథనపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చించారు. దీంతో డిసెంబరు ఒకటో తేదీన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు రావెల కిషోర్ బాబు సిద్ధమయ్యారు. 
 
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గాలు అప్రమత్తమయ్యాయి. రావెల కిషోర్ బాబును బుజ్జగించేందుకు తమ వంతు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ బుజ్జగింపుల కారణంగా ఆయన వెనక్కి తగ్గుతారా లేదా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జనసేనలో చేరుతారా అన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments