Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ రాజీనామా

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (13:10 IST)
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో పోషించిన చురుకైన పాత్ర నుండి తాత్కాలిక విరామం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
 
అమరీందర్‌ సింగ్‌కు రాసిన లేఖలో... తన తదుపరి చర్యల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. 'మీకు తెలిసినట్లుగా.. ప్రజా జీవితంలోని క్రియాశీల పాత్ర నుండి కొంత విరామం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ మేరకు మీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తించలేను. అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నా బాధ్యతల నుండి తప్పిస్తారని ఈ లేఖ రాస్తున్నాను' అని పేర్కొన్నారు. 
 
వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్‌ చర్య.. ముఖ్యమంత్రిని నైరాశ్యంలోకి నెట్టినట్లైంది. సిద్దుతో విబేధాలు పొడిచూపిన సమయంలో.. మార్చిలో ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రధాన సలహాదారుగా అమరీందర్‌ నియమించుకున్నారు. 
 
అయితే ప్రశాంత్‌ కిశోర్‌ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఆయన చూపంతా 2024 సార్వత్రిక ఎన్నికలు, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పైనే కేంద్రీకరించినుట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామాచేశారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments