Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య కేసు : బెయిలుపై విడుదలైన మారుతీరావు

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (10:59 IST)
నల్గొండకు చెందిన ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణబ్ భార్య అమృత తండ్రి మారుతీ రావు. ఈ కేసులో ఈయనకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో కోర్టు నుంచి ఆయన విడుదలయ్యాడు. 
 
మిర్యాలగూడలో మంచి పలుకుబడివున్న ధనవంతుల్లో మారుతీరావు ఒకరు. ఈయన కుమార్తె అమృత. అయితే, ఈమెను అదే ప్రాంతానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని మారుతిరావు.. కిరాయి మనుషులతో ప్రణయ్‌ను హత్య చేయించాడు. 
 
ఈ కేసులో మారుతిరావుతో పాటు.. ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్, హత్య చేసిన ఖరీంలను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిజానికి వీరు శనివారమే వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉన్నా... బెయిల్ పత్రాలు నిర్ణీత సమయంలో అందక పోవడంతో ఆదివారం ఉదయం విడుదల చేశారు. 
 
కాగా, ఈ ముగ్గురిపై 2018 సెప్టెంబర్‌ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వస్తే ప్రణయ్‌ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments