Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీలింగ్‌కి వేలాడుతూ కనిపించిన భర్త... అర్థగంటలో ఆర్ఐ భార్య సూసైడ్

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (20:59 IST)
కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేని భార్య కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇనస్పెక్టర్‌గా సుశీల అనే మహిళ పని చేస్తోంది. ఈమెకు గుండా నారాయణ రెడ్డి (34) అనే వ్యక్తితో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 
 
అయితే, సోమవారం ఉదయం భర్త నారాయణ రెడ్డితో భార్య సుశీల గొడవపడి ఆఫీసుకు వెళ్లిపోయింది. మధ్యాహ్న భోజన విరామంలో భర్తను చూసేందుకు ఇంటికి వచ్చింది. కానీ, అప్పటికే ఆయన విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. 
 
సుశీల ఇంటికి వచ్చేసరికి భర్త సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. ఆపై స్థానికుల సాయంతో భర్త మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి ఆటోలో ఆమె బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రాచర్ల వద్ద ఆటోను ఆపించి, నారాయణరెడ్డి మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. 
 
ఆ తర్వాత భర్త చనిపోయిన అర్థ గంటలోనే సుశీల కూడా ఆత్మహత్యకుఈ నేపథ్యంలో సుశీల కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. దీంతో వారిఇద్దరు పిల్లలు ఇపుడు అనాథలయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments