Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (12:26 IST)
రాష్ట్ర అసెంబ్లీలో 'దిశ' బిల్లుకు ఆమోదం లభించిన రోజే ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... త్రిపురాంతకం మండలానికి చెందిన యువతి(19)కి మతిస్థిమితం లేదు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో బహిర్భూమి కోసం బయటకు వచ్చిన ఆమెను ఇంటి పక్కనే ఉండే అలవాల కరుణాకర్‌రెడ్డి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆమె ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు వెతకడం ప్రారంభించారు.
 
 
గ్రామంలోని రామాలయం సమీపంలో ఆమెతో పాటు ఉన్న నిందితుడు వీరిని చూసి పరారయ్యాడు. బాధితురాలి పెదనాన్న కుమారుడు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు గ్రామశివారులోని రైస్‌మిల్లులో దాక్కున్న కరుణాకర్‌రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎర్రగొండపాలెం సీఐ మారుతీకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments