Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబం మొత్తం అంత పని చేసిందా..? కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:01 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశాలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం, అల్లినగరం గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు (45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. 
 
కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. కానీ చేసిన అప్పులు పీకల మీదకు రావడంతో పాలుపోని స్థితిలో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సభ్యులంతా కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనలో నాగరాజు, ఆతని భార్య ఈశ్వరి, కుమార్తె వైష్ణవి చనిపోగా, మరో కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకుంటే.. వేరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments