Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబం మొత్తం అంత పని చేసిందా..? కూల్‌డ్రింక్స్‌లో పురుగుల మందు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:01 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. క్షణికావేశాలు ఆత్మహత్యలకు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం, అల్లినగరం గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు (45) బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. 
 
కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. కానీ చేసిన అప్పులు పీకల మీదకు రావడంతో పాలుపోని స్థితిలో కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సభ్యులంతా కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనలో నాగరాజు, ఆతని భార్య ఈశ్వరి, కుమార్తె వైష్ణవి చనిపోగా, మరో కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేకుంటే.. వేరేదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments