Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వింత : ఆటో డ్రైవర్ ఇంటికి రూ.3.31 లక్షల విద్యుత్ బిల్లు

Webdunia
సోమవారం, 10 జులై 2023 (07:36 IST)
విశాఖపట్టణం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గోకులపాడు అనే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు విద్యుత్ బోర్డు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఆటో డ్రైవర్ నివసించే పూరి గుడిసెకు కరెంట్ బిల్లు ఏకంగా 3,31,951 రూపాయలు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
గోకులపాడు దళిత కాలనీలో పూరి గుడిగెలో నివాసం ఉంటున్న రాజుబాబు అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఉండేది పూరి గుడిసె. దీనికి ఏకంగా లక్షలాది రూపాయల్లో విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో రాజబాబు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈబీ అధికారులను సంప్రదించారు. 
 
సాంకేతిక సమస్య కారణంగా బిల్లు అంతమొత్తం వచ్చినట్టు గుర్తించారు. బిల్లును సరిచేసి వినియోగదారునికి బిల్లు అందజేసి, సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దీనిపై కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి మాట్లాడుతూ, వినియోగదారుడికి ఈ నెల రూ.155 బిల్లు వచ్చిందని, అతనికి ఎస్సీ రాయితీ ఉండటంతో ఆ మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments