Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వింత : ఆటో డ్రైవర్ ఇంటికి రూ.3.31 లక్షల విద్యుత్ బిల్లు

Webdunia
సోమవారం, 10 జులై 2023 (07:36 IST)
విశాఖపట్టణం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని గోకులపాడు అనే గ్రామానికి చెందిన ఓ ఆటో డ్రైవర్‌కు విద్యుత్ బోర్డు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. ఆటో డ్రైవర్ నివసించే పూరి గుడిసెకు కరెంట్ బిల్లు ఏకంగా 3,31,951 రూపాయలు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
గోకులపాడు దళిత కాలనీలో పూరి గుడిగెలో నివాసం ఉంటున్న రాజుబాబు అనే వ్యక్తి ఆటో డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఉండేది పూరి గుడిసె. దీనికి ఏకంగా లక్షలాది రూపాయల్లో విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో రాజబాబు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈబీ అధికారులను సంప్రదించారు. 
 
సాంకేతిక సమస్య కారణంగా బిల్లు అంతమొత్తం వచ్చినట్టు గుర్తించారు. బిల్లును సరిచేసి వినియోగదారునికి బిల్లు అందజేసి, సాంకేతిక సమస్యను పరిష్కరించారు. దీనిపై కొరుప్రోలు సెక్షన్ ఏఈ గోపి మాట్లాడుతూ, వినియోగదారుడికి ఈ నెల రూ.155 బిల్లు వచ్చిందని, అతనికి ఎస్సీ రాయితీ ఉండటంతో ఆ మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments