Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ పదవికి ఎసరు? వైకాపా నేత పీవీపీ చెబుతున్న జోస్యం ఏంటి?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డికి పదవీగండం తప్పదా? దీనికి గతంలో జరిగిన ఓ సంఘటనను వైకాపా నేత ఒకరు ఉదహరిస్తున్నారు. అదేంటంటే.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి హోదాలో దివంగత ఎన్టీఆర్ అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన పదవీచ్యుతుడయ్యాడని గుర్తుచేస్తున్నారు. ఇపుడు కూడా కేజీహెచ్‌లో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకానుందా? అనే ప్రశ్నకు వైకాపా నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ వరప్రసాద్ తనదైనశైలిలో బదులిచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
గతంలో కేజీహెచ్‌లో అడుగుపెట్టిన తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని గుర్తు చేశారు. ఈ సంఘటన 1995లో జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి ధైర్యం చేసి 25 సంవత్సరాల తర్వాత మళ్లీ విశాఖ కేజీహెచ్‌లో అడుగుపెట్టారని చెప్పారు.
 
ఎన్టీఆర్ తర్వాత అక్కడ మరే ముఖ్యమంత్రి అడుగుపెట్టలేదన్నారు. కానీ, మళ్లీ ఇప్పుడు ప్రజల కోసం జగన్ అడుగుపెట్టారని చెప్పారు. ఇక్కడ పదవి పోతుందని జగన్ భయపడలేదనీ, జగన్‌కు ప్రజా సంక్షేమమే ప్రధానమని, పదవి కాదని అన్నారు. గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు కేజీహెచ్ ఆసుపత్రికి జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments