Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (16:02 IST)
సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళిని ఏపీ సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి
 తీసుకున్నారు. దీంతో ఆయన వద్ద ఒక్క రోజు పాటు విచారణ సాగనుంది. విచారణ నిమిత్తం పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పోలీసులు గుంటూరు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానికి కోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో మంగళవారం సీఐడీ పోలీసులు పోసానిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత పోసానిని గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత తమ కార్యాలయానికి తీసుకెళ్లి పోసాని వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లు, వారి కుటుంబ సభ్యులను అనుచితంగా, అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే. పైగా, మార్ఫింగ్ చేసిన ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ అంశాలపై టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోసానిపై ఏపీ వ్యాప్తంగా 17కు పైగా కేసులు నమోదైవున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోసానికి సీఐడీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. 
గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments