Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. ఎందుకు? పోసాని చెప్పిన నిజం ఏంటి?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (08:58 IST)
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ నిజం వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారన్నారు. అందుకే చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు వీధుల్లోకిలాగారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చిరంజీవి తనవద్ద పలుమార్లు ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకున్నారని పోసాని వెల్లడించారు. 
 
తాజాగా టీడీపీ నేతలపై వైకాపా మహిళా నేత షర్మిల ఆరోపణలు చేశారు. దీనిపై పోసాని స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళలపై ఏమాత్రం గౌరవమర్యాదలు లేవన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎంతో గౌరవంగా చూడాల్సి ఉన్నా... ఆ రోజుల్లోనే ఆమెను చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని మహిళగా (అన్ పాప్యులర్) చేశారని చెప్పారు.
 
ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారని, అపుడు చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు ఎంతో దారుణంగా విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని షర్మిళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, కుటుంబంలోని ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని... దానికి తానే సాక్ష్యమని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments