Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి.. ఎందుకు? పోసాని చెప్పిన నిజం ఏంటి?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (08:58 IST)
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఓ నిజం వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారన్నారు. అందుకే చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు వీధుల్లోకిలాగారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని చిరంజీవి తనవద్ద పలుమార్లు ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకున్నారని పోసాని వెల్లడించారు. 
 
తాజాగా టీడీపీ నేతలపై వైకాపా మహిళా నేత షర్మిల ఆరోపణలు చేశారు. దీనిపై పోసాని స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలకు మహిళలపై ఏమాత్రం గౌరవమర్యాదలు లేవన్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎంతో గౌరవంగా చూడాల్సి ఉన్నా... ఆ రోజుల్లోనే ఆమెను చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని మహిళగా (అన్ పాప్యులర్) చేశారని చెప్పారు.
 
ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారని, అపుడు చిరంజీవి ఇంటి ఆడపడుచులను సైతం టీడీపీ నేతలు ఎంతో దారుణంగా విమర్శలు చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని షర్మిళ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే, కుటుంబంలోని ఆడపడుచులను రోడ్డుపైకి లాగారంటూ చిరంజీవి చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారని... దానికి తానే సాక్ష్యమని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments