రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయం : పొన్నం ప్రభాకర్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:23 IST)
రాష్ట్ర విభజన అనేది ఓ ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందువల్ల ఏపీ పాలకులు, ఇటు తెలంగాణ పాలకులు ఇరు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోరుకుంటున్నామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. 
 
రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి ఇక భవిష్యత్తులో తావు లేదన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఓ కేసు ఉండొచ్చు. ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనపుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ కొత్త పల్లవి అందుకోవడం విచిత్రంగా ఉందన్నారు. 
 
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణాపై మరోమారు దాడికి కుట్రగానే భావించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రా బాగుండాలి.. తెలంగాణ బాగుండాలి అని కోరుకోవాలి. కానీ వైకాపా ఉమ్మిడి రాష్ట్రం అంటోందంటే తెలంగాణపై మళ్లీ రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుందనే అర్థం అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments