Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రశాంతంగా సాగుతున్న పంచాయితీ పోరు

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (11:03 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల వాయిదాపడిన 36 సర్పంచ్, 68 వార్డు సభ్యుల స్థానాలకు ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ ప్రశాతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, మొత్తం సర్పంచ్ స్థానాల్లో ఇప్పటికే 30 సర్పంచ్ స్థానాలు, 380 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 
 
కాగా, రేపు నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
 
తెదేపా అభ్యర్థి భర్త కిడ్నాప్ 
అధికార వైకాపా పార్టీ అండతో పోలీసులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఆదివారం జరుగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో 4వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త.. మామిడాల మధును అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న నవాబుపేట పోలీసులు పీఎస్‌కు తరలించారు. 
 
అతని జేబులో రూ.2వేలు ఉన్నాయనే సాకుతో అక్రమంగా నిర్బంధించారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న తెదేపా నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
అర్థరాత్రి నుంచి ఆయన స్టేషన్‌ ఆవరణలో బైఠాయించారు. మధును విడుదల చేయకపోవడంతో కోటంరెడ్డి నిరసన కొనసాగుతోంది. 4వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి విజయం ఖాయం కావడంతో మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ప్రోద్బలంతోనే పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments