Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.. పోలీసులు ఏం చేశారంటే?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (12:17 IST)
విశాఖ జిల్లా అరిలోవలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేసారు. దాడి చేసిన పోలీసులకు కొంతమంది మహిళలు పేకాడుతూ కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై వారిపై కేసు పెట్టి వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టేశారు. 
 
ఈ సందర్భంగా ఆ మహిళల సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పరిశీలించగా అనేక విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. పేకాట కేసులో పట్టుబడిన మహిళల్లో కొందరు గంజాయి రవాణా, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
 
దీనిపై పోలీసులు ఇప్పటికే తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా దీని గురించి రహస్యంగా మరింత లోతైన విచారణ జరపాలని సీఐని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామకృష్ణాపురంలో పేకాటడుతున్న కొంతమంది మహిళలను ఆరిలోవ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదుచేశారు. 
 
అయితే మహిళలకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గుట్టుగా దీనికి సంబంధించిన తీగను లాగుతున్నట్టు తెలిసింది. దీనిపై సీఐ అశోక్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదంటూ సమాధానం దాటవేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments