Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో వైద్యులను చితకబాదిన పోలీసులు... డాక్టర్ల ధర్నా

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (10:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో విధులకు వెళుతున్న వైద్యులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. దీంతో వైద్యులు ధర్నాకు దిగారు. 
 
తమ ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ బారినపడిన రోగులకు వైద్య సేవలు అందిస్తుంటే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని, దారుణంగా తిడుతూ, తమను కొట్టారని వైద్యులు ఆరోపించారు. బుధవారం ఉదయం కొందరు మెడికోలు వెళుతుండగా, అడ్డుకున్న పోలీసులు వారిని ముందుకు కదలనీయలేదని తెలుస్తోంది. 
 
తాము వైద్యులమని ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పినా వినిపించుకోని పోలీసులతో మెడికోలు వాగ్వాదానికి దిగగా, వారిని కొట్టారన్నది ప్రధాన ఆరోపణ. దీన్ని నిరసించిన వైద్యులు స్థానిక లీలామహల్ సెంటర్‌లో ధర్నాకు దిగారు. తమపై చెయ్యి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ధర్నా ప్రాంతానికి చేరుకుని, శాఖా పరమైన విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇవ్వడంతో మెడికోలు ధర్నాను విరమించారు. అలాగే, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో కూడా విధులు నిర్వహిస్తున్న మీడియాతో పాటు.. ఆస్పత్రులకు వెళుతున్న వైద్యులపై ఖాకీలు లాఠీ చార్జ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments