Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపందాలపై పోలీసుల దాడి... నీటి కాలువలో పడి ముగ్గురి మృతి

Webdunia
బుధవారం, 30 అక్టోబరు 2019 (09:07 IST)
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో జోరుగా కోడిపందాలు సాగాయి. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోడిపందెం జోరుగా సాగుతున్న సమయంలో పోలీసులు దాడి చేశారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయే క్రమలో ముగ్గురు వ్యక్తులు నీటి కాలువలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసిన నిర్వాహకుల్లో ముగ్గురు పారిపోయే క్రమంలో సమీపంలోని కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. వారిని మధు, శ్రీనుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments