Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత : రైతు చేయి విరగ్గొట్టిన పోలీసులు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:09 IST)
రాజధాని అమరావతి ప్రాంత పరిరక్షణ కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 
 
ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయివిరిగింది. ప్రశాంతంగా సాగుతున్న మహా పాదయాత్ర రైతులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జ్‌లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే గ్రామాల ప్రజలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
 
అయినప్పటికీ మొక్కవోని సంకల్పంతో పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులిపోతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయస్థానం టు దేవస్థానం వరకు ఈ పాదయాత్రను చేసి తీరుతామని రైతులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments