Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత : రైతు చేయి విరగ్గొట్టిన పోలీసులు

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (13:09 IST)
రాజధాని అమరావతి ప్రాంత పరిరక్షణ కోసం ఆ ప్రాంత రైతులు చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 
 
ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన నాగార్జున అనే రైతు చేయివిరిగింది. ప్రశాంతంగా సాగుతున్న మహా పాదయాత్ర రైతులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా లాఠీచార్జ్‌లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే గ్రామాల ప్రజలను పోలీసులు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
 
అయినప్పటికీ మొక్కవోని సంకల్పంతో పోలీసుల ఆంక్షల నడుమే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులిపోతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా న్యాయస్థానం టు దేవస్థానం వరకు ఈ పాదయాత్రను చేసి తీరుతామని రైతులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments