Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (14:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. 16వ నంబరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన డ్రైన్‌లో ఫ్లెక్సీలు చుట్టి ఉంచిన మృతదేహం ఒకటి బుధవారం ఉదయం మంటల్లో కాలుతూ కనిపించింది. దీనిపై సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే మృతదేహం చాలా భాగం కాలిపోయింది. 
 
నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వర రావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారాయడు, యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్య చేసి మృతదేహాన్ని వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ తగలబెట్టారా? లేక ఇక్కడే హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు. 
 
ముఖం వరకు కాలిపోకుండా చూడటంతో కొద్దిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వయసు 35 యేళ్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించామని దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments