Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లల తల్లితో కానిస్టేబుల్ సహజీవనం, పెళ్ళి చేసుకోమన్నందుకు..?

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (19:47 IST)
పెళ్ళిచేసుకుంటానని నమ్మించాడు. మగ దిక్కులేని ఆ మహిళను లోబరుచుకున్నాడు. శారీరకంగా అనుభవించాడు. పెళ్ళి చేసుకోమంటే మాత్రం ముఖం చాటేశాడు. దీంతో ఆ మహిళ మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాలో ఘటన జరిగింది.
 
మదనపల్లెకి చెందిన సుగుణకి ములకలచెరువు మండలం పెద్దయ్యగారిపల్లికి చెందిన రమణారెడ్డితో వివాహమైంది. పెళ్ళయిన కొన్నేళ్ళకే మనస్పర్థలు తలెత్తడంతో భర్త వదిలేశాడు. దీంతో ఆమె మదనపల్లెలోని గౌతమీనగర్‌లో బ్యూటీపార్లర్ పెట్టుకుని ఇద్దరు పిల్లలను చదివించుకుంటోంది.
 
జైళ్ళ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కర్నూలు ప్రాంతానికి చెందిన చంద్రకాంత్ బదిలీపై మదనపల్లెకి వచ్చాడు. చంద్రకాంత్‌తో సుగుణకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి కారణమైంది. తనకు వివాహం కాలేదని.. నిన్నే పెళ్ళి చేసుకుంటానని కానిస్టేబుల్ నమ్మించాడు.
 
ఆమెను లొంగదీసుకున్నాడు. అయితే కానిస్టేబుల్ ఎంతకూ తనను పెళ్ళి చేసుకోకపోవడంతో ఆవేదనకు గురైంది సుగుణ. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటున్నట్లు కానిస్టేబుల్‌కు ఫోన్ చేసింది. అతను వచ్చేలోపే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.
 
కానిస్టేబుల్ కిందకు దింపి చూసేసరికి సుగుణ చనిపోయింది. చంద్రకాంత్ కారణంగానే తన కుమార్తె చనిపోయిందని సుగుణ తల్లి పోలీసులకు ఫిర్యాదు  చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments