Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:59 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 18వ తేదీన కేసు నమోదు చేశారు. దీంతో 41ఏ కింద కేసు నమోదు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
 
దీంతో ఆయన తన అనుచరురాలు దివ్వెల మాధురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆయనను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మీ వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేతల ప్రోద్బలం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా, తన భార్య దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్ విడాకులు ఇవ్వకుండానే దువ్వాడ మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు కూడా. ఈ క్రమంలో ఇటీవల దువ్వాడ మాధురి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments