Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

ఠాగూర్
శుక్రవారం, 20 డిశెంబరు 2024 (15:59 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. జనసేన పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 18వ తేదీన కేసు నమోదు చేశారు. దీంతో 41ఏ కింద కేసు నమోదు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో తమ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
 
దీంతో ఆయన తన అనుచరురాలు దివ్వెల మాధురితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆయనను టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మీ వ్యాఖ్యల వెనుక వైసీపీ కీలక నేతల ప్రోద్బలం ఉందా? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి జీవిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా, తన భార్య దువ్వాడ వాణికి దువ్వాడ శ్రీనివాస్ విడాకులు ఇవ్వకుండానే దువ్వాడ మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు కూడా. ఈ క్రమంలో ఇటీవల దువ్వాడ మాధురి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments