Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరీటాల దొంగ దొరికాడు... అక్కడికెళ్లి పట్టుకొచ్చారు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:20 IST)
గత శనివారం తిరుపతి నగరంలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపిన పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆలయాన్ని కూడా మూసివేసి రహస్య విచారణ జరిపారు. 
 
అయితే గుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పరిగెడుతూ, చేతిలో ఏవో వస్తువులను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అతడిని ముత్తయ్యగా నిర్ధారించి, అరెస్ట్ చేసినట్లు సమాచారం.
 
ఇతడు గతంలో కూడా కొన్ని దేవాలయాలలో దొంగతనాలు చేసాడు. కిరీటాలను దొంగిలించాక తమిళనాడు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments