Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పిన గోరంట్ల మాధవ్, ఊరొదలి వెళ్లిపొమ్మంటున్నారట

ఐవీఆర్
బుధవారం, 12 జూన్ 2024 (15:36 IST)
ఎన్నికల సమయంలో చిన్నచిన్న ఘర్షణలు జరిగాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు నియోజకవర్గాల్లో వైసిపి-తెదేపా కార్యకర్తలు, నాయకుల మధ్య దాడులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ స్పందిస్తూ... తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించేది లేదనీ, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లు వ్యవహరించాల్సి వుంటుందని వార్నింగ్ ఇచ్చారు.
 
దీనితో పలువురు తెదేపా కార్యకర్తలు ఆయనను బెదిరిస్తున్నారట. చంపేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారట. దీనితో తనను ఊరు వదిలి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ గోరంట్ల మాధవ్ చెబుతున్నారు. మంగళం వారం నాడు ఇద్దరు సీఐలు తన వద్దకు వచ్చి ఊరు వదలి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారనీ, ఐతే తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు విడిచి వెళ్లబోననీ, కార్యకర్తల కోసం ఇక్కడే వుంటానని చెప్పారు.
 
ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించింది ప్రజలకు సేవ చేయమని గానీ వైసిపి నాయకులపై దాడులు చేయమని కాదని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాడులకు భయపడి కొందరు కార్యకర్తలు ఊళ్లు వదిలి వెళ్లిపోయారనీ, ఐతే ఎవ్వరూ అధైర్యపడవద్దనీ, తాము అండగా వుంటామంటూ ధైర్యం చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments